విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి : ప్రైవేటు పాఠశాల ఫీజుల కోసం వేధిస్తుండడాన్ని తట్టుకోలేక కరీంనగర్‌లో ఓ పదో తరగతి విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే…. ఫీజుల భారం భరించలేక మరో ఇంటర్ విద్యార్థి కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో పవన్ అనే విద్యార్థి విద్యనభ్యసిస్తున్నాడు. అయితే… ఆ కాలేజీ యాజమాన్యం వసూలు చేస్తున్న ఫీజులను భరించలేక కాలేజీ భవనంపై నుంచి దూకి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కాలేజీ ఎదుట విద్యార్ధి తల్లిదండ్రులతోపాటు విద్యార్ధి సంఘాలు ధర్నా నిర్వహించాయి.