విద్యుత్తు కోతలతో ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ప్రభుత్వం

చిలుకూరు: అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తుకోతలు విధించి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని కోదాడ ఎమ్మెల్యే నేనేపల్లి చంద్రరావు అన్నారు. శుక్రవారం చిలుకూరు మండల కేంద్రంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్తు కోతలు విధించి అన్ని వర్గాల ప్రజలతో ఆటలాడుకుంటున్నారన్నారు. ప్రజలపై రూ.20వేల కోట్ల విద్యుత్తు ఛార్జీల భారాన్ని మోపేందుకు సిద్ధమవుతున్నారని