విద్యుత్తు ఛార్జీలు భారీగా పెంపుపై తెదేపా నిరసన

చిట్యాల: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను భారీగా పెంచటాన్ని నిరసిస్తూ చిట్యాలలో తెదేపా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి పాల్వాయి రజనీకుమారి హాజరయ్యారు. విద్యుత్తు బిల్లులను దహనం చేశారు. ఎస్పీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు షేపూరి రవీందర్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాచకొండ కృష్ణయ్య, పొన్నం లక్ష్మ య్య తదితరులున్నారు.