విద్యుత్తు ఛార్జీల పెంపుపై నిరసిస్తూ సీపీఎం రిలే నిరాహార దీక్షలు

నేరేడుచర్ల: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నేరేడుచర్లలో సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్తు ఛార్జీల పెంపు ద్వారా పేద మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కన్వీనర్‌ అనంత ప్రకాశ్‌, వ్యవసాయ కార్మి సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, సీపీఎం నాయకులు తిరుపతయ్య, క్రాంతి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.