విద్యుత్‌షాక్‌తో రైతు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

రంగారెడ్డి : విద్యుత్‌షాక్‌తో ఓ రైతు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం లక్ష్మాపూర్‌లో ఆదివారం ఉదయం మొత్తం నలుగురు రైతులు పొలం పనులకు వెళ్తుండగా… పొలాల సమీపంలో విద్యుత్ తీగెలు తగిలి ఓ రైతు మృతిచెందాడు. మిగతా ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ రైతు మతి చెందడం, మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది.