విప్ రేగాను మర్యాదపూర్వకంగా కలిసిన భూక్య శ్రావణి, ఎడమకంటి ఝాన్సీ 

బూర్గంపహాడ్ ఫిబ్రవరి11(జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం భూక్య శ్రావణి, ఉప సర్పంచ్ ఎడమ కంటి ఝాన్సీ శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవల టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గా నియమితులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీీీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.