వృద్దులు, అనాధ పిల్లలకు పండ్లు బ్రెడ్ పంపిణీ
ఏరియా హాస్పిటల్ డాక్టర్ గుడిశెల రాజా రమేష్ బాబు సోదరి గోడిశెల సురేఖ రాజ్ వర్ధంతి సందర్బంగా సింగరేణి ఏరియా ఆసుపత్రి రోగులకు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆనంద నిలయంలోని వృద్ధులకు, అనాధ పిల్లలకు పండ్లు, బ్రేడ్ ప్యాకెట్స్ సుమారు 150 మందికి పంపిణి చేయడం జరిగింది. అనంతరం డా.రాజరమేష్ మాట్లాడుతూ తన సోదరి బౌతికంగా దూరమైనా, తన హృదయంలో ఇంకా అలాగే ఉందని చెప్పడమే కాకుండా, తాను చేస్తున్న ప్రతి సేవ కార్యక్రమాలు అక్క జ్ఞాపకార్థం చేయడం తనకు అక్క పైన ఉన్న ప్రేమకు నిదర్శనంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా. రామ్మోహన్, డా. సృజన, మేట్రిన్ పుస్ఫ, సీనియర్ సిస్టర్ విక్టోరియా, సీనియర్ వార్డ్ అసిస్టంట్ నక్క సురేష్, ఆనంద నిలయం సభ్యులు, జీ.ఎస్.ఆర్. ఫౌండేషన్ కార్యదర్శి కటుకూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మేకల రాజయ్య, అకేనపల్లి సురేష్, ఉప కార్యదర్శి కన్న రమేష్, వెంకన్న,కోశాధికారి బద్రి సతీష్, సభ్యులు వేణు, రవి, ప్రకాష్,అశోక్, రంకిషోరే, సమ్మయ్య, నరేష్, మొగిలి, తదితరులు పాల్గొన్నారు