వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మహిళా కాంగ్రెస్.

బూర్గంపహాడ్ జూలై 08(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షరాలు బర్ల నాగమణి ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత  కాంగ్రెస్ నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని ఆమె గుర్తు చేశారు. పేద ప్రజల గుండెల్లో వైయస్సార్ చెరగని ముద్ర వేసుకున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మైపా మని, బి బ్లాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసు పాక సావిత్రి, చిన్ని, గిరిజ తదితరులు పాల్గొన్నారు.
Attachments area