వైకుంఠ ధామం కొసం కలెక్టర్ కి వినతి పత్రం

రఝునాధపాలెం నవంబర్ 07 జనం సాక్షి ఖమ్మం జిల్లా కలెక్టర్ ని రామన్నపేట అరవై వ డివిజన్ లో వైకుంఠధామం నిర్మాణానికి స్థలం ఇవ్వవలసిందిగా అలాగే గత వంద సంవత్సరాల పై నుండి సర్వేనెంబర్ యబైఎనిమిది లో షెడ్యూల్ కులాలకు చెందిన మేము దహన సంస్కరణలు అక్కడే చేసుకుంటున్నాము అయితే ఈ మధ్యకాలంలో శ్రీ అప్సెల్ హుస్సేన్ సాహెబ్ మమ్ములను అడ్డుకుంటూ మాపై దౌర్జన్యం చేస్తు మా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు ఎమ్మార్వో మస్తాన్రావు దృష్టికి తీసుకువెళ్లగా మేము కలెక్టర్ కు చెప్పాము అని మమ్ములను మభ్యపెడుతూ మా సమస్య కు పరిష్కారం చూపలేదు మా ఎస్సీ కుటుంబములలో ఎవరైనా చనిపోతే బిక్కు బిక్కుమంటు దహన సంస్కరణలు చేసుకోవాల్సి వస్తుంది ఇట్టి విషయాన్ని కలెక్టర్ కి విన్నవించగా సానుకూలంగా స్పందించి ఆర్డిఓ కి ఈ విషయమై పరిష్కారం చేయాలని సూచించడం జరిగింది
ఈ కార్యక్రమంలో మేడేపల్లి బాల శౌరి పెద్ద మాల జంగం కన్నయ్య సల్వాది పిల్లి సురేందర్ మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు నామ యేసు రత్నం మద్దెల జయరాజు జంగం నాయుడు మేడేపల్లి శ్రీను పిల్లి వెంకటేశ్వర్లు మేడేపల్లి సత్యం శ్రీను లు మరియు సామాజిక ఉద్యమకారులు పాల్గొన్నారు