వైరా అభ్యర్థి మదన్‌లాల్‌కు ప్రజల బాసట

ఖమ్మం,సెప్టెంబర్‌28(ఆర్‌ఎన్‌ఎ): ఏనుకూరు మండలంలో వైరా నియోజకవర్గ అభ్యర్థి మదన్‌ లాల్‌ పర్యటించారు. ఈ సందర్భంగా రాయి మాదారం, ఎర్ర బోడు గ్రామాల్లోని గిరిజన ప్రజలు మదన్‌ లాల్‌ కు బ్రహ్మరథం పట్టారు. తమ గ్రామానికి వచ్చినందుకు.. మదన్‌ లాల్‌ కు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ప్రజలంతా ముక్తకంఠంతో కారు గుర్తుకే మన ఓటు అని ప్రచారం చేశారు. ఎర్రబాడు గ్రామాల్లో 50 లక్షల రూపాయలతో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని.. అదేవిధంగా గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పని చేశారని గ్రామ ప్రజలు అడుగడుగునా టీఆర్‌ఎస్‌కు జేజేలు కొట్టారు. అనంతరం ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.