వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ త్వరగా కోలుకోవాలి

టిఆర్ఎస్ నేతల ప్రత్యేక పూజలు

జూలూరుపాడు, జులై 11, జనంసాక్షి: వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ తనకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోం క్వారెంటైన్లో ఉండి వైద్యం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్తానిక సాయిబాబా ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, ఎంపిపి లావుడియా సోని, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు యదళ్లపల్లి వీరభద్రం, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, మోదుగు రామకృష్ణ, వేల్పుల నరసింహారావు, రామిశెట్టి నాగేశ్వరరావు, ఎస్ కె మైబు, పణితి వెంకటేశ్వర్లు, గుగులోతు చంటి, మాడుగుల నాగరాజు, మిరియాల కిరణ్, మంద నరసింహారావు, మైకు శ్రీను, మంద సురేష్, ఎలకపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు