వ్యక్తి దారుణహత్య

బాలానగర్‌: మండంలోని తిరుమలాపూర్‌ గ్రామంలో పెదిరి యాదయ్య అనే (48) వికలాంగుడిని రాత్రి దుండగులు
దారుణంగా హత్య చేశారు. గ్రామంలోని కమ్యూనిటీ భవనం వద్ద నిద్రిస్తున్న యాదయ్యను అతికిరాతకంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.