వ్యక్తీ పై విద్యుత్తు చౌర్యం కేసు నమోదు

అచ్చంపేట ఆర్ సి, సెప్టెంబర్ 24,( జనం సాక్షి న్యూస్);- స్థానిక పట్టణ కేంద్రం రాజీవ్ చౌరస్తా సమీపంలో మున్సిపల్ శాఖకు చెందిన భవన సముదాయంలో పక్కనఉన్న తాలూకా ప్రెస్ క్లబ్ భవనంలో అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. ఇదే విషయమై విద్యుత్తు శాఖ అధికారి ఆంజనేయులు వివరాలు తెలుపుతూ.. తాలూకా ప్రెస్ క్లబ్ భవనంలో షెటర్ ను కిరాయికి తీసుకున్న వ్యక్తి కొండూరి గణపతి విద్యుత్ చౌర్యానికి పాల్పడినందుకు అతని పై విద్యుత్తు శాఖ కేటగిరి 2 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు..