శబరిమలకు పాదయాత్రగా వెళ్లి వచ్చిన స్వాములకు సన్మానం చేసిన డీసీసీబీ చైర్మన్ బుయ్యని

కుల్కచర్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి శబరిమలకు పాదయాత్రగా వెళ్లి తిరిగి వచ్చిన స్వాములు చెన్నయ్య మరియు ఊటువల్లి మహిపాల్ స్వాములను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. అయ్యప్ప మాలధారణ అత్యంత పవిత్రమైనదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు రామ్ లాల్, తెరాస నాయకులు కనకం మొగులయ్య, బచ్చిరెడ్డి వినోద్ కుమార్, అయ్యప్ప గురు స్వాములు ఈశ్వరయ్య, రాములు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.