శాంతి భద్రత సమస్యల పరిష్కారం కోసం పోలీసు శాఖ పనిచేస్తుంది

ఏ ఎస్పీ. బి.రాములు నాయక్.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 19 (జనం సాక్షి);
శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై పోలీసు శాఖ పూర్తిస్థాయిలో పని చేస్తుందని జోగులాంబ గద్వాల జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను జిల్లా అదనపు ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ,పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ ఆదేశించారు. మహిళలు ఇతరుల చేత ఎలాంటి వేధింపులకు గురైన వెంటనే పోలీస్ వారిని సంప్రదించాలని కోరారు. సివిల్ వివాదాలను పిర్యాదు దారులు
కోర్టులలోపరిష్కరించుకోవాలని,సివిల్ వివాదాలు స్వీకరించబడువు అనే విషయాలను పిర్యాదు దారులు గ్రహించాలని అన్నారు.ఈ రోజు వచ్చిన 8 ఫిర్యాదుల వివరాలు కొడుకులు చూడటం లేదని -1,భూ వివాదాలకు సంబంధించి -3,స్మశాన వాటికల ఆక్రమణకు సంబంధించి-2,అత్తమామల వేధింపులకు సంబంధించి -1,గొడవలకు సంబంధించి -01 ఫిర్యాదులు రావడం జరిగిందని ఆయన అన్నారు.