శిథిలావస్తాలో ప్రభుత్వ పాఠశాలలు.

మాచారెడ్డి మండల హెడ్ క్వార్టర్ లో గల ప్రైమరీ స్కూల్ శిథిలా వ్యవస్థకు చేరుకుందని భారీ వర్షాలకు ఎప్పుడు కూలిపోతుందో అని పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ,బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని, ఎలాంటి ప్రమాదం జరగకుండా వెంటనే నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని నూతన భవనం ఏర్పాటు అయ్యేంతవరకు సురక్షిత భవనంలోకి విద్యార్థిని విద్యార్థులను తరలించాలని వారి విద్యాభివృద్ధికి తోడ్పడాలని కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఈఐ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాచారెడ్డి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గోరింటాల భాస్కర్ గౌడ్, మాట్లాడుతూ   నూతన భవనం ఏర్పడేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో    ఎన్ ఎస్ సి ఐ ప్రెసిడెంట్ బద్రి, రాజు, శంకర్, కాశీం, ఇర్షాద్, రోహిత్, రాజేష్, సమీర్, అస్లాం ,అమీర్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.