శ్రీకాంతాచారి ఆశయ సాధనకై పోరాడాలి

 తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి ఆశయసాధనకై పోరాడాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమాశంకర్ పిలుపునిచ్చారు.శనివారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాంతా చారి లాంటి ఎంతో మంది యువకుల బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యమ ఆకాంక్ష కూడ నెరవేరడం లేదన్నారు.అమరుల త్యాగాలు అవహేళన చేయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం కెసీఆర్ అమరుల ఆకాంక్షలను పట్టించుకోకుండా కుటుంబ , అవినీతి పాలన సాగిస్తున్నారని విమర్శించారు.అమరుల స్ఫూర్తితో ప్రజాస్వామిక తెలంగాణ సాధనకై తెలంగాణ జనసమితి పోరాడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మాండ్ర మల్లయ్య , యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాబోయిన కిరణ్, పట్టణ పార్టీ అధ్యక్షులు దొన్వాన్ బంధన్ నాయక్ , మైనార్టీ సెల్ నాయకులు అక్తర్ , కృష్ణ తదితరులు పాల్గొన్నారు.