శ్రీనివాసుని సన్నిధిలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు.

తాండూరు జూన్ 24 (జనం సాక్షి)కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గురువారం తిరుమలలో కోలుదీరిన ఆపదమొక్కులవాడు కోరిన కోరికలు తీర్చే కలియుగ వైకుంఠ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయీభవ అంటూ వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయ ప్రాప్తిరస్తు అంటూ దీవించారు.