శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన కోడెబోయిన రవి.

బూర్గంపహాడ్ జూలై 06(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక బిజెపి కార్యాలయంలో ఓబీసీ  మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేసగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కోడెబోయిన రవి బిజెపి పార్టీలో చేరారు. ఆయనను కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు వెంకట్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కూడబోయిన రవి మాట్లాడుతూ బిజెపి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే పార్టీ బిజెపి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజ్జం శ్రీనివాస్ రెడ్డి, బాలు నాయక్, చుక్కపల్లి బాలాజీ, వెలిశెట్టి రామారావు, దుప్పటి సురేష్, బెల్లపు కొండ  అనిత, పాలెం రవీంద్ర రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.