శ్రీ దత్త గిరి లో పండరీపూర్ పీఠాధిపతుల పూజలు

ఝరాసంగం సెప్టెంబర్ 25( జనంసాక్షి)జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న బర్దిపూర్ ఆశ్రమంలో పండరిపూర్ కరండే క్షేత్ర పీఠాధిపతులు శ్రీ అభాదన్ మహారాజ్, సంత్ భీమ్ రావు మహారాజ్ బర్దిపూర్ ఆశ్రమం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ముందుగా రాజగోపురం వద్ద వేద పాఠశాల విద్యార్థులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం జ్యోతిర్లింగాల కు రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ దత్తాత్రేయ అత్రిమహర్షి పంచ వృక్షాలు వద్ద పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ శనీశ్వర ఆలయానికి సందర్శించారు. వారికి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూత  మహారాజ్ వారికి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.