షాపు యజమాని పై కేసు నమోదు..

వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్ బాబు
కేసముద్రం, అక్టోబర్ 12 జనం సాక్షి /
మండల కేంద్రంలోని  భద్రకాళి టెక్స్ టైల్స్ యజమాని రాపాక కుమారస్వామి ఇంటి నిర్మాణ పనికి వచ్చిన తాపీ మేస్త్రీలు నిర్లక్ష్య వైఖరి వలన గోవాకర్ర విరిగి క్రిందపడడంతో రంగాపురం గ్రామానికి చెందిన లేదళ్ల మల్లయ్య (50) గాయాలు కావడంతో హాస్పిటల్ కి తరలిస్తుండగా మంగళవారం రోజున మార్గ మధ్యలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.మృతుడి భార్య లేదళ్ల సుమలత పిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన
షాపు యజమాని రాపాక కుమారస్వామి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ రమేష్ బాబు వెల్లడించారు. మరో ఇద్దరు నిర్మాణ కార్మికులు కేసముద్రం విలేజ్ గ్రామానికి చెందిన ఎస్కే జానీ, సబ్ స్టేషన్ తండాకు చెందిన గోశెట్టి వికాస్ కి స్వల్ప గాయలైనట్లు గుర్తించారు.