సంక్షేమం సాగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి: పాయం

భద్రాచలం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్‌ర్లు అన్నారు. వాటిలో మిషన్‌ కాకతీయ, రైతుబంధు, కంటివెలుగు వంటి ఎన్నో పథకాలు ఉన్నాయన్నారు. మహాకూటమి మాయ కూటమిగా మారిందన్నారు. గత నాలుగున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తనను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని అన్నారు. కెసిఆర్‌ నాయకత్వం మాత్రమే తెలంగాణకు ఎరామరక్ష అన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా పాయం వారికి హావిూ ఇచ్చారు.