సంగేం శ్రీరాంపూర్ గ్రామంలో ఘనంగా స్వర్గీయ వై ఎస్ ఆర్ గారి వర్ధంతి.

టి పి సి సి నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు.

మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్:02 మండలంలోని
సంగేం శ్రీరాంపూర్ గ్రామంలో మాజీ ఉమ్మడి రాష్ట్రముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డా.. వై ఎస్ ఆర్ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు . టి పి సి సి నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు మాట్లాడుతూ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వై ఎస్ ఆర్ గారిది అని,అందరి హృదయాల్లో వై ఎస్ ఆర్ దేవుడని కొనియాడారు.నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకము మరియు వృద్ధాప్య పింఛన్ రైతులకు రుణమాఫీ నిరుపేదలకు రేషన్ ద్వారా తొమ్మిది రకాల వంట సరుకులు అందించడం జరిగింది మరియు రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది మరియు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్య శ్రీ పథకం నిరుపేదలైనటువంటి వారికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకం పెట్టినటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఒక దేవునితో పోల్చుకుంటారు ఇంకా మరెన్నో పథకాలు అందించినటువంటి ఘనత వైయస్ఆర్ అని కల్వకుంట్ల సుచిత్ రావు కొనియాడారు కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆరిపెల్లి నరేష్ ,టీపీసీసీ ఫిషేర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్ గౌడ్, కొరుట్ల పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏ ఆర్ అక్బర్ ,ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక డైరెక్టర్ కళ్లెడ గంగాధర్, ఎం డి రాజి ,మామిడి రాజశేఖర్ రెడ్డి , ఈపపెల్లి గణేష్,కూన రాకేష్, బైండ్ల శ్రీకాంత్, మోగిలి రాజేంద్ర,కరం సింగ్, సల్మాన్, అన్వర్ ,గంగోని శ్రీనివాస్,కొమ్ముల చిన్న రెడ్డి .తదితరులు పాల్గొన్నారు.