సంతకాల సేకరణ

భువనగిరి, జనంసాక్షి: పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పెంట నరసింహ, సింగిల్‌ విండో ఛైర్మన్‌ సత్తిరెడ్డి పాల్గొన్నారు.