*సన్నిధానంలో అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

ఈరోజు కోదాడ లోని ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న గాలి శ్రీనివాస్ నాయుడు స్థలం లో జరుగు కార్యక్రమానికి కోదాడ మాజీ శాసనసభ్యులు ఉత్తం పద్మావతి హాజరయ్యారు. అన్నదానం మహాదానం స్వాములు కఠినమైన దీక్షతో పూజా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. దీనితోపాటుగా నియోజకవర్గ పరిధిలోని పలు వివాహ కార్యక్రమాలకు హాజరయ్యి వధూవరులను దీవించారు. అనంతరం అధ్యాపకులు  రామానుజ రావు, ఇంటికి వెళ్లి రామానుజరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు .ఈమెతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, వరప్రసాద్ రెడ్డి, వంగవీటి రామారావు, బాగ్దాద్, రజనీకాంత్, చింతలపాటి శ్రీను, జానీ, సైదాబాబు  తదితరులు పాల్గొన్నారు.