సన్న బియ్యం అక్రమ తరలింపునకు యత్నించిన వార్డెన్

మహబూబ్‌నగర్‌: పేద విద్యార్థులకు అందవలసిన సన్న బియ్యం అక్రమార్కుల వద్దకు చేరుకుంటున్నాయి. కల్వకుర్తిలోని ఎస్సీ బి హాస్టల్‌లోని వార్డెన్‌ రాములు చేతివాటం ప్రదర్శించాడు. 25 క్వింటాళ్ల సన్న బియ్యం అక్రమ తరలింపునకు యత్నించాడు. అయితే ఇతనిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.