సమాజ శ్రేయస్సు ప్రధాత ఉపాధ్యాయుడే

– గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అనిల్ గౌడ్
– బి హెచ్ ఎస్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
– రిటైర్డ్ ఎంఈఓ నాగప్ప కు ఘన సన్మానం

మక్తల్, సెప్టెంబర్ 5, (జనం సాక్షి న్యూస్)

సమాజశ్రేయస్సు ప్రదాత ఉపాధ్యాయుడేనని, ఉపాధ్యాయ వృత్తి ఉత్కృష్టమైన దని బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిల్ గౌడ్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సోమవారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో గల రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిటైర్డ్ ఎమ్ ఈ ఓ నాగప్ప ను శాలువా పూలమాల మెమొంటో తో ఉపాధ్యాయులందరూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అనిల్ గౌడ్ మాట్లాడుతూ నవ భారత నిర్మాణం లో ఉపాధ్యాయుని పాత్ర ఎన లేనిదని అన్నారు. ఈనాడు సభ్య సమాజంలో ఒకరిద్దరు ఉపాధ్యాయులు చేసే వెకిలి చేష్టలతో ఉపాధ్యాయ వృత్తికి కలంకం వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. చాలామంది ఉపాధ్యాయులు ఆదర్శవంతంగా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే సమాజం దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తికి మించిన పని మరొకటి లేదని ఆయన ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో ఎం ఈ ఓ లక్ష్మి నారాయణ, ఉపధ్యాయ సంఘ నాయకులు, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, రవీందర్ భీమ్ రెడ్డి, విభీషన్, నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు.