సర్పంచ్ భర్త కారును దగ్ధం చేసిన దుండగులు

రామారెడ్డి  అక్టోబర్ 9   ( జనంసాక్షీ)  :
సర్పంచ్ భర్త కారును దగ్ధం చేసిన గుర్తుతెలియని దుండగులు సంఘటన స్థలానికి రామారెడ్డి ఎస్ఐ చేరుకొని పరిస్థితిని సమీక్షించి సర్పంచ్ భర్త కారు తగలబడిన తీరును పరిశీలించారు. అనంతరం ఎస్ఐ  అనిల్ కుమార్ మాట్లాడుతూ, రామారెడ్డి మండలం ఇసన్నపల్లి  గ్రామంలో కాలభైరవ స్వామి పరిసరాల ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇసన్నపల్లి సర్పంచ్ కందూరి బాలామణి భర్త కారు రోజు వారీగా విధిగా పార్కింగ్ చేశారు. రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు  కారుకు నిప్పంటించి పూర్తిగా దగ్ధం చేసి అక్కడి ప్రజలను బయందోళనకు గురి చేశారని అన్నారు. కాలభైరవ స్వామి సన్నిధిలో ఉన్న సిసి కెమెరాల పుటెజిని పరిశీలించామన్నారు. ఈ కేసును త్వరిత గతిన దర్యాప్తు చేపట్టి  త్వరలోనే  దుండ గులను పట్టుకుని శిక్ష పడెల  చర్యలు తీసుకుంటా మన్నారు.