*సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కలెక్టరు వినతిపత్రం*

పెబ్బేరు జూన్13 ( జనంసాక్షి ): పెబ్బేరు పట్టణం నుంచి మోడల్ స్కూల్,మహిళ పాలిటెక్నిక్, మత్స్య కళాశాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని బైపాస్ నుంచి మహిళ పాలిటెక్నిక్ కళాశాల వరకు సర్వీస్ రోడ్డు అతిత్వరగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ యాస్మిన్ భాష కు  పెబ్బేరు చెందిన శ్రీరామ్ యూత్ సభ్యుడు తోకల మహేష్ వినతిపత్రాన్ని సమర్పించారు.
వెంటనే కలెక్టర్  స్పందించి ఈ విషయం నేషనల్ హైవే అథారిటీ వారి పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం 6 లైన్ రోడ్డు ఏర్పాటుకు పనులు ప్రారంభించారని అది పూర్తి అవగానే సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ యాస్మిన్ భాష  హామీ ఇచ్చారు..