సాగర్ రహదారిపై సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన బిజెపి నాయకులు

బిజెపి ఎంపి అరవింద్ ఇంటి పై తెరాసా నాయాకుల దాడి నీ నిరసిస్తూ ఇబ్రహీం పట్నం సాగర్ రహదారిపై సీఎం దిష్టి బొమ్మ దహనం చేసిన బిజెపి నాయకులు.
ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ఎంపి అరవింద్ ఇంటి పై దాడి చేయటం దుర్మార్గం అని అన్నారు. ఎమ్మెల్సీ హోదాలో ఉన్న  కవిత తోటి ప్రజా ప్రతినిధి లపైన చెప్పుల తోటి కొడతామని అనడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. మరో ఎమ్మెల్సీ శంబి పూరి రాజు బిజెపి నేతల పై ప్రత్యక్ష దాడులు చేస్తామని  భాహిరంగంగా మాట్లాడటం దేనికి నిదర్శనం అనీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రతిగటిస్తున్న బిజేపీ నేతల పై దాడులు చేయటం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెరాసా నేతలు ఇలాగే దాడులు చేస్తే బిజెపి నేతలు ఆధాడులను ప్రతిగటిస్తమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ముత్యాల భాస్కర్,నాయిని సత్య నారాయణ, కిసాన్ సెల్ అధ్యక్షుడు , జాతీయ నాయకులు నల్ల బోలు బోజి రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్, ఏన్ను యాదగిరి రెడ్డి మండల అధ్యక్షలు దండే శ్రీశైలం,గణేష్,దొండ రమణా రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నా