సామాజిక న్యాయమే ధ్యేయంగా కృషి చేస్తా

టీజేఎస్ నేత గూగులోతు బద్రు నాయక్

, జూలై 16( జనం సాక్షి): సామాజిక న్యాయమే ధ్యేయంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని టీజేఎస్ జిల్లా నాయకుడు గుగులోతు బద్రు నాయక్ అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం తనను జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని చిత్తశుద్ధితో పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి గ్రామాలలో తెలంగాణ జన సమితి జెండా నెగరువేయడానికి కృషి చేస్తానని తెలిపారు.