సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు

, జులై 13, జనంసాక్షి: మండల పరిధిలోని వెంగన్నపాలెం దత్తనగర్లో కొలువుదీరి ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు జరుపుకున్నారు. ఆలయ పూజారి శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా జూలూరుపాడు, వెంగన్నపాలెం, గుండెపుడి, పాపకొల్లు, పడమట నర్సాపురం, సాయిరాంతండా పరిసర గ్రామాలకు చెందిన సాయి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూలూరుపాడు సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు..