సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

ఖమ్మం,అక్టోబర్‌30  (జనంసాక్షి) : వైద్య సహాయం కోసం సిఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పువ్వాడ అన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులను వనివారం మంత్రి అందచేశారు. 32`మందికి గాను రూ.19.30లక్షల విలువైన చెక్కులను ఖమ్మం క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో నేటి వరకు 2000 చెక్కులకు గాను రూ.8.61కోట్లు రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేయడం సంతోషకారంగా ఉందన్నారు.