సిద్ధయ్య అంతిమయాత్ర ప్రారంభం..

మహబూబ్ నగర్: ఎస్ ఐ సిద్ధయ్య అంతిమయాత్ర ప్రారంభం అయింది. సిద్ధయ్యను కడసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అంతిమయాత్రలో పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయనేతలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతోపాటు పలువురు పాల్గొన్నారు. సిద్ధయ్య మృతితో జడ్చర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురి రోదనలు మిన్నంటాయి.