సిద్ధయ్య..కన్నీటి నివాళి..

wl9mb9yc మహబూబ్ నగర్ : వీరమరణం పొందిన ఎస్ఐ సిద్ధయ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు. సిద్ధయ్య స్వగ్రామమైన జడ్చర్లలో అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు చేశారు. అంతకుముందు నిర్వహించిన అంతిమయాత్రలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. సిద్ధయ్యకు తమకు ఉన్న సంబంధం నెమరు వేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కాల్పుల్లో గాయపడిన సిద్ధయ్య ఆసుపత్రిలో చేరిన రోజే భార్య ధరణీష డెలివరీ నిమిత్తం అదే ఆసుపత్రిలో చేరి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన భర్త మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న ధరణీష కన్నీటిపర్యంతమైంది.