సిద్ధయ్య భౌతికకాయానికి మంత్రుల నివాళులు

మహబూబ్‌నగర్ : వీరమరణం పొందిన ఎస్‌ఐ సిద్ధయ్య భౌతికకాయానికి మంత్రులు లకా్ష్మరెడ్డి, జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు. సిద్ధయ్య వీరణమరణం పొందారు. ఆయన మృతి తీరని లోటు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సిద్ధయ్య విధులు నిర్వహించారు. సిద్ధయ్య ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సిద్ధయ్య మృతి చెందడం దురదృష్టకరమన్నారు. సిద్ధయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. సిద్ధయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.