సీసీఐ కేంద్రంలో తడిసిన పత్తి

నల్గొండ : నకిరేకల్‌ వ్యవసాయ మార్కెట్‌  యార్డు నకిరేకల్‌లోని భారత పత్తి సంస్థ కొనుగోలు కేంద్రంలో రాత్రి నుంచి పడుతున్న అకాల వర్షానికి 6000 క్వింటాళ్ల పత్తి తడిసిపోయింది. దీనిలో 3000 క్వింటాళ్ల పత్తి రైతులు తీసువచ్చింది కాగా మరో 3000 క్వింటాళ్లు సీసీఐ ఈ పాటికే కొనుగోలు చేసిన పత్తి ఉంది. పత్తి తడిసిన కారణంగా ఈరోజు కొనుగొళ్లు ఉండవని సీసీఐ అధికారులు తెలియజేశారు.