సుల్తానాబాద్‌ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

కరీంనగర్‌: తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సుల్తానాబాద్‌ మండలం చిన్న బొంకూరులో ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్‌నేత, ఎమ్మెల్యే కే తారకరామారావు,తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మెన్‌ ఫ్రొపెసర్‌ కోదండరామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ చేసిన అనంతరం సమావేశంలో వారు మాట్లడుతూ తెలంగాణ నీళ్లను దోచుకు పోతున్నారనిఅన్నారు. రాష్ట్ర జేఏసీ నాయకులు, రాష్ట్ర విద్యార్ధి జేఏసీ నాయకుడు రాకేష్‌, టీఆర్‌ఎస్‌ వర్గనాయకులు సత్యనాయణరెడ్డి , దాసరి మనోహర్‌రెడ్డి నల్లమనోహర్‌ రెడ్డి , కోల్‌కంటి చందర్‌, పారుపల్లి వైకుంటపతితదితరులు పాల్గొన్నారు.