సూర్యపేట వద్ద రోద్దు ప్రమాదం

నల్గొండ : ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి గుంతలోకి జారిపోవడంతో 15 మంది ప్రయాణికులు త్రీవంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు వర్షం కారణంగా కేకేపల్లి మండలం కోర్గపహడ్‌ వద్ద అదుపుతప్పి గుంతలోకి జారిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలిసులు 108 సాయంతో క్షతగ్రాతులను సూర్యపేటలోని ఆసుపత్రికి తరలించారు.