సోషల్‌ మీడియాలో ఓవరాక్షన్‌ చేస్తే జాగ్రత్త..

` కఠిన చర్యలు తప్పవు
` వ్యక్తిత్వ హననం, ఫేక్‌ న్యూస్‌లపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని డీజీపీ శివధర్‌ రెడ్డి హెచ్చరిక
` వ్యక్తులు, కుటుంబాలపై తప్పుడు వార్తలు సరికాదని వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి):చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి హెచ్చరించారు. మహిళా ఐఏఎస్‌ అధికారి గౌరవానికి భంగం కలిగించేలా ఓ టీవీ ఛానల్‌, యూట్యూబ్‌ ఛానళ్లలో కథనాలు ప్రసారమైన నేపథ్యంలో డీజీపీ స్పందించారు. ‘సోషల్‌ విూడియా అత్యుత్సాహంపై గతంలోనే హెచ్చరించాం. సోషల్‌ విూడియా పేరుతో వ్యక్తిత్వ హననం చేస్తే చర్యలు తప్పవు. వ్యక్తులు, కుటుంబాల గురించి తప్పుడు వార్తలు వేయవద్దు. వ్యక్తిగత అంశాలపై ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయకూడదని పేర్కొన్నారు. సోషల్‌ విూడియా వేదికగా జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై డీజీపీ శివధర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గతంలోనే తమ విధానాన్ని వెల్లడిరచినట్లు గుర్తు చేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అక్టోబర్‌ ఒకటో తేదీన జరిగిన విలేకరుల సమావేశంలో.. సోషల్‌ విూడియా వినియోగంపై మార్గనిర్దేశర చేస్తూ, చట్ట పరిమితులను దాటి వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశానని పేర్కొన్నారు. సోషల్‌ విూడియా పేరుతో ఎవరైనా వ్యక్తిత్వ హననం చేయడం, ఇతరుల శీలానికి భంగం కలిగించడం, క్యారెక్టర్‌ అసాసినేషన్‌కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తమ విధానంగా తెలియజేశానన్నారు. అలాగే ఇతర వ్యక్తుల గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, అసత్య ఆరోపణలు చేయడం, ఫేక్‌ న్యూస్‌ను సర్కులేట్‌ చేసి వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం అనుమతించబోమని మరోమారు స్పష్టం చేశారు. చట్టానికి లోబడి, నిర్మాణాత్మక విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని డిజిపి అన్నారు .అయితే ఆ పరిమితులను దాటి, సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ అబద్దాలు ప్రచారం చేస్తే మాత్రం సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.