స్ఫూర్తి ప్రదాత మదర్ థెరిస్సా

తొర్రూరు:27 ఆగస్టు (జనంసాక్షి )
నిస్సహాయులను అక్కున చేర్చుకొని వారికోసం జీవిత చరమాంకం వరకు పాటుపడిన మదర్ థెరిస్సా స్ఫూర్తి ప్రదాత అని బాలాజీ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు నరుకుటి సంతోష్ అన్నారు.
శనివారం డివిజన్ కేంద్రంలో బాలాజీ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మానవతా మూర్తి మదర్ థెరిస్సా జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.
 మానవ సమాజం  ఉన్నంత వరకు మదర్‌ థెరిస్సా సేవలు మరువలేనివని  పేర్కొన్నారు. తన  సేవలతో అందరికీ అమ్మ అయిన మదర్‌ థెరిస్సా సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.   తోటి వారికి సాయం చేయడానికి తన జీవితాన్నే త్యాగం చేసి మానవత్వం అన్న మాటకు ప్రతిరూపంగా నిలిచిన విశ్వమాత మదర్ థెరిస్సా  సామాజిక సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు.
థెరిస్సా  స్ఫూర్తితో బాలాజీ సోషల్ సర్వీస్ సొసైటీ సామాజిక కార్యక్రమాల పరంపర కొనసాగిస్తుందన్నారు.
కార్యక్రమంలో  సంఘ జిల్లా అధ్యక్షుడు చార్ల వెంకటేశ్వర్లు,   ఉపాధ్యక్షులు భూతం నరసింహ,   ప్రతినిధులు కొండలు, చిత్తారి మదార్,   నరుకుటి పద్మ, ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు.