హత్యకేసులో మాజీ మావోయిస్టు విక్రమ్‌కు జీవిత ఖైదు

మహబూబ్‌నగర్‌ : ఓ హత్యకేసులో మాజీ మావోయిస్టు విక్రమ్‌కు మహబూబ్‌నగర్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. జిల్లాలోని అమన్‌గల్‌ మాజీ ఎంపీపీ పంతునాయక్‌ హత్య కేసులో మాజీ మావోయిస్టు విక్రమ్‌ నిందితుడు. నేరం రుజువు కావడంతో మహబూబ్‌నర్‌లోని కుటుంబ న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదులో పాటు 50వేల రూపాయల జరిమానా విధించింది.