*హమాలీల కార్మికులకు అండగా ఉంటా

 మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి
రామన్నపేట డిసెంబర్ 1 (జనంసాక్షి) మండల కేంద్రంలోని నిదాన పల్లి హమాలి కార్మికులు వేములకొండ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిదానపల్లి హమాలి కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. హమాలీల సంక్షేమ నిధి కోసం గురువారం  ఆర్థిక సహాయంగా వారికి 13000 రూపాయలు  కార్మికులకు  అందజేశారు. అనంతరం వేములకొండ గుట్టపై కొలువుదీరిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శామా అభిషేక్ రెడ్డి తదితరులు ఉన్నారు.