హమాలీ ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌  ; మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం అమడబాకంలో హమాలీగా పనిచేస్తున్న గొల్ల రాములు (42) ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి గత కొంత కాలంగా మతిస్థిమితం లేదని, దీనికితోడు కుటుంబ కలహాలు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.