హస్తంతో మోసం చేయొద్దు: ఎమ్మెల్యే చందర్‌రావు

చిలుకూరు: రాష్ట్ర ప్రభుత్వం అమ్మహస్తం పథకం పేరుతో పేద ప్రజలను మోసం చేయవద్దని కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు అన్నారు. గురువారం చిలుకూరు మండల కేంద్రంలో అమ్మహస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల వారిని , తెలుపు కార్డులు ఉన్న పేదలను మోసం చేసేందుకే ఈ పథకాన్ని పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలో మండల తహశీల్దార్‌ సూర్యనారాయణ, ఎంపీడీవో నాగిరెడ్డి, డీటీడీఎస్‌ పద్మనాభరావు, ఆర్‌ఐ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.