15 నుంచి ఓటిటిలో స్ట్రీమ్‌ కానున్న సమ్మతమే

వినూత్న కథలను ఎంచుకుంటూ తన నటన, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. చేసింది నాలుగు సినిమాలే అయినా ప్రేక్షకులలో మంచి స్థానం సంపాదించుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో ’సెబాస్టియన్‌’తో నిరాశపరిచిన ఇటీవలే విడుదలైన ’సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. జూన్‌ 24న విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్‌ టాక్‌ను తెచ్చుకుని సూపర్‌ హిట్‌గా నిలిచింది. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ను పూర్తి చేసుకుని కమర్షియల్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 15నుండి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. కాగా సినిమా విడుదలైన నాలుగు వారాల్లోపే డిజిటల్‌లోకి వచ్చేస్తుంది. లవ్‌ ఎంట్టంల్గªనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని గోపినాథ్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. కిరణ్‌కు జోడీగా ’కలర్‌ఫోటో’ ఫేం చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించింది. శేఖర్‌ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కంకనాల ప్రశీణ నిర్మించారు