1,50,000 రూపాయల ఎల్వోసిని అందజేసిన ఎమ్మెల్యే బీరం.

కోడేరు (జనం సాక్షి) జూన్ 23 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన కేతావత్ బాబు తండ్రి దుర్గ్యా కి, సి ఎమ్ ఆర్ ఎఫ్,పథకం కింద మంజూరు అయిన 1,50,000 రూపాయల ఎల్వోసి ని కొల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బీరం హర్షవర్థన్ రెడ్డి, గురువారం రోజు వారి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేయడం జరిగింది.సిఎం సహయనిధి ద్వారా అందించే సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆపద సమయంలో వైద్య ఖర్చుల కొరకు సిఎం సహాయ నిధి ఆపధ్బాందులా ఆదుకుంటుందని ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేదప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మేల్యే భీరం తెలిపారు.
మా వినతిని మన్నించి  ప్రత్యేక చొరవ తీసుకుని రూ 1,50,000 లో ఎల్వోసిని మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి కి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తో పాటు కొల్లాపూర్ మార్కెట్ కమిటి చైర్మన్ కిషన్ నాయక్,సర్పంచు కే లాల్ సింగ్ నాయక్, హన్మంతు నాయక్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రవి కుమార్, ప్రజాప్రతినిధులు తదీతరులు ఉన్నారు.