2న ఆహారభద్రతపై సదస్సు

విజయనగరం, జూలై 30 : ఆహారభద్రత అంశంపై వామపక్షాల ఆధ్వర్యంలో ఆగస్టు 2న అమర్‌ భవన్‌లో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కమిటీ కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సుకు ప్రజలు హాజరుకావాలని కోరారు.