సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపించాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 9. (జనం సాక్షి). జిల్లాలో విద్యాసంస్థల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేసారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ జిల్లాలో చదువుతున్న విద్యార్థులు బస్సులు విద్యాసంస్థల సమయానికి రాకపోవడం ద్వారా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి రావాల్సి వస్తుందని బస్సు పాసులు ఉన్నప్పటికీ ప్రైవేటు వాహనాల ద్వారా డబ్బులు చెల్లించి ఆర్థికంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కార్యక్రమంలో నాయకులు శశి కుమార్, సాదిక్, అజయ్, సిద్ధార్థ, తదితరులు పాల్గొన్నారు.