20,21తేదీల్లో సార్వత్రిక సమ్మె

నల్గొండ, ఫిబ్రవరి 2 (): దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలని సిఐటీయూ జిల్లా అధ్యక్షుడు తిరందాసు గోపీ కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 20, 21వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉప ఆ ఉపధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి, నాయకులు యుగందర్‌రెడ్డి, తొర్పూనూరి భగత్‌, ఉపేంద్ర, గుత్త తదితరులతో పాటు  మండల కార్యదర్శి ఎం.డి.పాషాలు పాల్గొన్నారు.